ఘనంగా అన్నమయ్య దినము ద్వాదశి
ఘనంగా అన్నమయ్య దినము ద్వాదశి
తిరుపతి, 2012 జూలై 15: పరమపవిత్రమైన ద్వాదశి తిథినాడు పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు శ్రీవారిలో ఐక్యమైన మహత్తర సందర్భాన్ని పురస్కరించుకుని తితిదే ఆదివారం నాడు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ‘అన్నమయ్య దినము ద్వాదశి’ని ఘనంగా నిర్వహించింది.
ఈ సందర్భంగా మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. అంతకు ముందు ఉదయం 10.30 గంటలకు దినము ద్వాదశి సంకీర్తనలతో అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గోష్ఠిగానం నిర్వహించారు. ఉదయం 11.30 గంటలకు హరికథా పారాయణం జరిగింది. సాయంత్రం 6.00 గంటలకు తిరుపతికి చెందిన తితిదే విశ్రాంత తెలుగు అధ్యాపకులు విద్వాన్ శ్రీ సింగరాజు సచ్చిదానందం ”ద్వాదశి-తాళ్లపాక కవుల ప్రత్యేకత” అనే అంశంపై ఉపన్యసించనున్నారు. రాత్రి 7.00 గంటలకు శ్రీమతి ఎం.వి.అరుణకుమారి సంగీత సభ నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్ మేడసాని మోహన్, ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ డాక్టర్ కె.వాణి, ఇతర అధికారులు, విశేషసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.