జూలై 23 నుండి 25వ తేదీ వరకు వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలు

జూలై 23 నుండి 25వ తేదీ వరకు వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలు

తిరుపతి, 2012 జూలై 18: చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలు జూలై 23వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నాయి. జూలై 23వ తేదీన అంకు రార్పణంతో ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. మొదటిరోజు సేనాధిపతి ఉత్సవం జరుగనుంది.

జూలై 24వ తేదీన ఉదయం యాగశాల పూజ, స్నపనతిరుమంజనం, సాయంత్రం శాంతి కళ్యాణం, హనుమంత వాహనసేవ నిర్వహించనున్నారు. జూలై 25వ తేదీన ఉదయం యాగశాల పూజ, స్నపనతిరుమంజనం అనంతరం పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరుగనుంది. సాయంత్రం గరుడ వాహనంపై శ్రీపట్టాభిరాముడు విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించ నున్నారు. అనంతరం మహాపూర్ణాహుతి, కుంభోద్వాసన, కుంభప్రోక్షణం నిర్వహించనున్నారు.

గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి శ్రీరామ పట్టాభిషేకం ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదాన్ని బహుమానంగా అందజేస్తారు.

ఈ మూడు రోజుల పాటు తితిదే హిందూధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, భజనలు, ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.