UGADI ASTHANAM AT SRI GOVINDARAJA SWAMY TEMPLE ON MARCH 30 _ మార్చి 30న శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో ఉగాది ఆస్థానం

KOIL ALWAR TIRUMANJANAM ON MARCH 27

Tirupati, 22 March 2025: The Asthanam will be held on the occasion of Ugadi festival on March 30 at Sri Govindaraja Swamy temple in Tirupati.

From 4.30 pm to 6 pm Panchanga Sravanam and Ugadi Asthanam will be held.

Koil Alwar Tirumanjanam in connection with Ugadi will be held on March 27 at Sri Govindaraja Swamy temple. 

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మార్చి 30న శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో ఉగాది ఆస్థానం

– మార్చి 27న‌ కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం

తిరుప‌తి, 2025 మార్చి 22: తిరుపతి శ్రీ గోవిందరాజ‌స్వామివారి ఆలయంలో మార్చి 30న ఉగాది ప‌ర్వ‌దినం సందర్భంగా ఆస్థానం జ‌రుగ‌నుంది.

ఇందులో భాగంగా సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన నిర్వహిస్తారు. సాయంత్రం 4.30 నుండి 6 గంట‌ల వ‌ర‌కు పంచాంగ శ్రవణం, ఉగాది ఆస్థానం జ‌రుగ‌నుంది.

కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో మార్చి 27వ తేదీ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. మార్చి 30న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఇందులో భాగంగా గురువారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 7 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను ఉదయం 9.30 గంటల నుండి దర్శనానికి అనుమతిస్తారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.