SRI SOUMYANATHA SWAMY BLESSES DEVOTEES ON SESHA VAHANAM _ శేషవాహనంపై దివ్య మంగళస్వరూపంలో భక్తులను కటాక్షించిన శ్రీ సౌమ్యనాథస్వామివారు

Tirupati / Nandalur, July 26, 2026: As part of the annual Brahmotsavams at Sri Soumyanatha Swamy Temple, Nandalur, the Lord blessed devotees on Sesha Vahanam on the fifth day of the festival on Sunday morning.

Depicting Lord Mahavishnu seated on Adisesha, the beautifully decorated deity attracted a large number of devotees. The procession, accompanied by devotional chanting, traditional music and bhajans, created a spiritually vibrant atmosphere.

On July 27, the Lord will bless devotees on Surya Prabha Vahanam in the morning and Chandra Prabha Vahanam in the evening.

Temple officials, priests and a large number of devotees participated in the Vahana Seva.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI 

శేషవాహనంపై దివ్య మంగళస్వరూపంలో భక్తులను కటాక్షించిన శ్రీ సౌమ్యనాథస్వామివారు

తిరుపతి / నందలూరు, 2026 జూలై 26: ఐదో రోజు బ్రహ్మోత్సవాల్లో ఆధ్యాత్మిక వైభవంగా శేషవాహన సేవ నందలూరులోని శ్రీ సౌమ్యనాథస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన ఆదివారం ఉదయం శ్రీ సౌమ్యనాథస్వామివారు శేషవాహనంపై దివ్య మంగళస్వరూపంలో భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహించారు.

ఆదిశేషునిపై కొలువై జగత్పాలకుడైన శ్రీమహావిష్ణువు దివ్యరూపాన్ని ప్రతిబింబించేలా అలంకరించిన స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. “గోవింద… గోవింద…” నామస్మరణలు, చెక్కభజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ సాగిన వాహనసేవ ఆలయ పరిసరాలను భక్తిరసపూరితంగా మార్చింది. అడుగడుగునా భక్తులు కర్పూరహారతులు సమర్పించి స్వామివారి దివ్య కటాక్షాన్ని పొందారు.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా జూలై 27వ తేదీ సోమవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై, రాత్రి చంద్రప్రభ వాహనంపై శ్రీ సౌమ్యనాథస్వామివారు భక్తులకు దివ్య దర్శనం ఇవ్వనున్నారు.

ఈ వాహనసేవలో ఆలయ ఏఈవో శ్రీ రవి, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ దిలీప్, ఆలయ అర్చకులు, అధికారులు, సేవకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.