PURNAHUTI HELD _ శ్రీ నారాపుర వేంకటేశ్వర ఆలయంలో మహాపూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవములు
Tirupati, 04 September 2025: The annual Pavitrotsavams Concluded with Maha Purnahuti on Thursday in Sri Narapura Venkateswara Swamy temple at Jammalamadugu in Kadapa district.
Temple staff, archakas and devotees participated.
ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన, కొలువు నిర్వహించారు. అనంతరం యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో విశేషంగా అభిషేకం చేశారు.
సాయంత్రం ఉత్సవమూర్తులను ఊరేగింపు వేడుకగా జరుగనుంది.
ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టిటిడి ముఖ్య ప్రజా సంబందాల అధికారిచే విడుదల చేయబడినది.


