సెప్టెంబరు 22 నుంచి అక్టోబ‌రు 2వ తేదీ వరకు దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు

సెప్టెంబరు 22 నుంచి అక్టోబ‌రు 2 తేదీ వరకు దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు

తిరుపతి / కడప,2025, సెప్టెంబర్  18: దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సెప్టెంబరు 22 నుంచి అక్టోబ‌రు 2 తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు జరుగనున్నాయి సందర్భంగా సదరు రోజులలో ప్రతిరోజూ ఉదయం 11 గం. నుండి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహిస్తారుఇందులో భాగంగా పాలుపెరుగుతేనెచందనంకొబ్బరినీళ్లుఇతర పండ్ల రసాలతో విశేషంగా అభిషేకం చేస్తారుప్రతి రోజూ సాయంత్రం 07 గం.లకు వాహన సేవలు ప్రారంభం కాగా,28 తేదీ గరుడ వాహనంపై 05.00 గం.లకు స్వామిఅమ్మవారు భక్తులను ఆశీర్వదించనున్నారు.

 సందర్భంగా సెప్టెంబర్ 22 తేదీ సాయంత్రం తిరుచ్చి ఉత్సవం, 23 తేదీ శేష వాహనం, 24 తేదీ చిన్న ప్రభ వాహనం, 25 తేదీ హనుమంత వాహనం, 26 తేదీ గరుడ వాహనం, 27 తేదీ ముత్యపు పందిరి వాహనం, 28 తేదీ గరుడ వాహనం, 29 తేదీ తిరుచ్చి వాహనం, 30 తేదీ సర్వభూపాల వాహనంఅక్టోబర్ 01 తేదీ చిన్న శేష వాహనంఅక్టోబర్ 02 తేదీ అశ్వవాహనంపై స్వామిఅమ్మవారు విహరించి భక్తులను ఆశీర్వదించనున్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.