HANUMANTA VAHANA SEVA HELD _ హనుమంత వాహనంపై ప‌ట్టాభి రాముడు

Tirupati, 01 April 2025: On the sixth morning Hanumanta Vahana Seva was held as a part of ongoing annual Brahmotsavam at Sri Kodandarama temple in Tirupati on Tuesday morning.

Later Snapana Tirumanjanam was held to the utsava deities.

Both the Senior and Junior Pontiffs of Tirumala, DyEO Smt Nagaratna, other temple staff, and devotees were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

హనుమంత వాహనంపై ప‌ట్టాభి రాముడు

తిరుపతి, 2025 ఏప్రిల్ 01: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు మంగ‌ళ‌వారం ఉదయం 8 గంట‌ల‌కు స్వామివారు హనుమంత వాహనంపై అభయమిచ్చారు. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

త్రేతాయుగంలో రామభక్తునిగా, భగవద్భక్తులలో అగ్రగణ్యుడుగా ప్రసిద్ధిగాంచిన వాడు హనుంతుడు. రాముడు భక్తాగ్రగణ్యుడైన హనుమకు ఆత్మతత్వాన్ని బోధించినట్లు ప్రాచీన వాఙ్మయం నుండి తెలుస్తోంది. హనుమంతుడు తనను సేవించే భక్తులకు ఆత్మోన్నతిని ప్రసాదిస్తున్నాడు. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో హనుమద్వాహన సేవను సిరియ తిరువడిగా కీర్తిస్తారు.

అనంతరం ఉదయం 10.30 గంటలకు శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర మూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, కొబ్బరినీళ్లు, చందనంలతో అభిషేకం చేశారు.

వాహ‌న‌సేవ‌లో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ ర‌వి, సూపరింటెండెంట్ శ్రీ మునిశంక‌ర్‌, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ సురేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.