ANKURARPANAM FOR SRI KODANDARAMA SWAMY PAVITROTSAVAMS ON AUGUST 7 _ ఆగ‌స్టు 7న శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ

Tirupati, August 6, 2026: Ankurarpanam for the annual Pavitrotsavams of Sri Kodandarama Swamy Temple will be performed on August 7 evening. The three-day festival will be held from August 8 to 10.

The Pavitrotsavams are conducted annually to uphold the sanctity of the temple through Vedic rituals. Daily Snapana Tirumanjanam, processions, and special yajna rituals will be performed. Devotees can participate in the festival by paying Rs.500 per couple.

Spiritual discourses and devotional music programmes will also be organised every day by the TTD Hindu Dharma Prachara Parishad and Annamacharya Project.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI 

ఆగ‌స్టు 7 శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ

తిరుపతి, 2026 ఆగ‌స్టు 06: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలకు ఆగ‌స్టు 7న సాయంత్రం శాస్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు. ఆగ‌స్టు 8 నుండి 10వ తేదీ వరకు ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి.

వైదిక సంప్రదాయం ప్రకారంజాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.

పవిత్రోత్సవాల్లో భాగంగా మొదటిరోజు యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ, శయనాధివాసం, రెండో రోజు పవిత్ర సమర్పణ, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మూడో రోజు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. ప్రతిరోజూ ఉదయం స్నపనతిరుమంజనం, సాయంత్రం తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి పవిత్రోత్సవాల్లో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, చివరిరోజు ఒక పవిత్రం బహుమానంగా అందజేస్తారు.

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.