BALALAYA ANKURARPANAM HELD_ శ్రీ ప్ర‌స‌న్న ‌వెంక‌ట‌ర‌మ‌ణస్వామివారి ఆల‌యంలో బాలాల‌యంకు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

TIRUPATI, 08 NOVEMBER 2025: The Ankurarpana for the Balalayam ceremony of the Punganur based TTD temple, Sri Prasanna Venkataramana was held on Saturday evening.
 
Vedic rituals like Shanti Homam, Kalakarshana will be observed on Sunday.
 
Temple priests and office staff were present.
 
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

శ్రీ ప్ర‌స‌న్న‌ వెంక‌ట‌ర‌మ‌ణ స్వామివారి ఆల‌యంలో బాలాల‌యంకు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

తిరుపతి, 2025 న‌వంబర్ 08: చిత్తూరు జిల్లా పుంగ‌నూరులోని శ్రీ ప్ర‌స‌న్న‌ వెంక‌ట‌ర‌మ‌ణ స్వామివారి ఆల‌యంలో శ‌నివారం సాయంత్రం బాలాలయ సంప్రోక్షణకు  శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ నిర్వ‌హించారు.

ఇందులో భాగంగా సాయంత్రం 5 గంటలకు ఆల‌యంలో ఏర్పాటు చేసిన యాగశాలలో పుణ్యాహ‌వ‌చ‌నం, రుత్విక్‌వ‌ర‌ణం, వాస్తు పూజ‌, శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వ‌హించారు.

కాగా, న‌వంబ‌రు 9న ఉద‌యం 8 గంట‌లకు యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు, శాంతి హోమం, వాస్తు హోమం, కళాకర్షణలో భాగంగా గర్భాలయంలోని శ్రీ ప్ర‌స‌న్న‌ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి మూల‌మూర్తి శ‌క్తిని కుంభంలోకి ఆవాహ‌న చేసి యాగ‌శాల‌లో ప్ర‌తిష్టించి ఆరాధ‌న‌లు చేట్టారు. సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

న‌వంబ‌రు 10వ తేదీన‌ ఉద‌యం 7.30 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు పూర్ణాహుతి, బాలాలయ సంప్రోక్షణ ఆగ‌మోక్తంగా నిర్వహించ‌నున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ ఆగమ సలహాదారులు శ్రీ వి.శ్రీనివాసాచార్యులు, సూపరింటెండెంట్ శ్రీ నాగేంద్ర, టెంపుల్ ఇన్స్పెక్టర్ లు శ్రీ భాను, రాహుల్, ఆలయ అర్చకులు, సిబ్బంది  పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.