TIRUMALA TEMPLE REOPENS AFTER GRAHANANANTARA SUDDI _ శ్రీవారి ఆలయంలో దర్శనం ప్రారంభం
DEVOTEES ALLOWED FOR DARSHAN FROM 8PM ONWARDS
Tirumala, 03 March 2026: After the temple doors remained closed from 9am till 7:30pm in Tirumala following Lunar Eclipse on Tuesday, darshan resumed for Srivari devotees from 8pm onwards after performing Suddhi and other cleansing rituals.
Even the Annaprasadam Complex and Laddu Counters also became functional from 8:30pm onwards.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి ఆలయంలో దర్శనం ప్రారంభం
ముగిసిన చంద్ర గ్రహణం
రాత్రి 8.30 నుండి యధావిధిగా అన్నప్రసాద వితరణ
తిరుమల, 2026 మార్చి 03: శ్రీవారి ఆలయంలో మంగళవారం రాత్రి 8 గంటల నుండి భక్తులకు దర్శనం ప్రారంభమైంది. మధ్యాహ్నం 3.26 నుండి సాయంత్రం 6.47 గంటల వరకు చంద్ర గ్రహణం ఉన్న కారణంగా ముందుగా నిర్ణయించిన ప్రకారం ఉదయం 9 గంటలకు ఆలయ తలుపులు మూశారు.
దాదాపు 10.30 గంటల అనంతరం మంగళవారం రాత్రి 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచారు. ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం, కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.
అన్నప్రసాద వితరణ ప్రారంభం
చంద్ర గ్రహణం కారణంగా మంగళవారం ఉదయం 9 గంటలకు మూసివేసిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్సును 7.30 గంటలకు తెరిచారు. వంటశాల శుద్ధి అనంతరం రాత్రి 8.30 గంటల నుండి భక్తులకు అన్నప్రసాద వితరణ ప్రారంభమైంది. అదే విధంగా లడ్డు కౌంటర్లు కూడా పునః ప్రారంభమయ్యాయి.



