DENIZENS ENTHRALLED _ భక్తులను అలరించిన “పలువిచారములేల, సముఖ హెచ్చరిక, వందేవాసుదేవం” సంకీర్తనలు

Tirupati, 06 October 2024  : The art lovers in Tirupati were enthralled by a series of devotional programs in Tirupati on Sunday.
 
The performances on Veena, Bharatnatyam, by the students of SV college of Music and Dance at Mahati, allured Tirupatites.
 
The cultural programs at Annamacharya Kalamandiram and Ramachandra Pushkarini organised by TTD in  view of Tirumala annual Brahmotsavam also impressed the locals.
 
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భక్తులను అలరించిన “పలువిచారములేల, సముఖ హెచ్చరిక, వందేవాసుదేవం” సంకీర్తనలు

 తిరుప‌తి, 2024 అక్టోబ‌రు 06 ; శ్రీవారి వార్షిక‌ బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజైన ఆదివారం తిరుప‌తి మహతి క‌ళాక్షేత్రంలో టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో పలువురు కళాకారులు ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు విశేషంగా అలరించాయి.

సాయంత్రం 6:30 నుండి 7:30 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ శ్రీనివాస్ కుమార్, శ్రీ శ్యామ్ కుమార్ యుగళభక్తి సంగీతంలో తమ మృదు మధుర గాత్రంతో
అన్నమయ్య కీర్తనలైన పలువిచారములేల, సముఖ హెచ్చరిక, వందేవాసుదేవం తదితర కీర్తనలతో శ్రోతలను అలరించారు.

అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6:30 నుండి 7:30 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు శ్రీమతి చిన్నమ్మ దేవి గాత్రకచేరి, రాత్రి 7:30 నుండి 8:30 గంటల వరకు శ్రీ రవి సుబ్రహ్మణ్యం భరతనాట్యం ప్రదర్శించారు.

శ్రీ రామచంద్ర పుష్కరిణి వద్ద ఎస్వి సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థులచే వీణ కచేరి, డా. శరత్ చంద్ర బృందం భరతనాట్యం ప్రదర్శించారు.

ఈ కార్యక్రమాలు తిరుపతి పుర ప్రజలను మంత్రముగ్ధులను చేశాయి.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది