PADMAVATI RIDES HER FAVOURITE GAJA VAHANAM _ గజ వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారి కటాక్షం
గజ వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారి కటాక్షం
తిరుపతి, 2024 డిసెంబరు 02: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదో రోజు సోమవారం రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు గజ వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు.
అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.
వాహనసేవల్లో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్స్వామి, టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు, ఈవో శ్రీ జె శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి, చంద్రగిరి ఎంఎల్ఏ శ్రీ పులివర్తి నాని, బోర్డు సభ్యులు శ్రీమతి సుచిత్ర, జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీ శ్రీధర్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.