SRI MALAYAPPA SWAMY TAKES FIVE ROUNDS ON FLOAT _ తెప్పపై శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి అభయం

Tirumala, 01 March 2026: On the fourth evening of the ongoing Srivari Salakatla Teppotsavam in Tirumala on Sunday, Sri Malayappa Swamy along with Sridevi Bhudevi took five rounds on the finely decked float in Swamy Pushkarini and blessed devotees.

Tirumala Sri Sri Sri Chinna Jeeyar Swamy, TTD Additional EO Sri Ch Venkaiah Chowdary, Temple Deputy EO Sri Lokanatham, Peishkar Sri Rama Krishna and other officials participated in this religious event.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తెప్పపై శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి అభయం

తిరుమల, 2026 మర్చి 01: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో నాలుగో రోజు ఆదివారం రాత్రి శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు తెప్పపై భక్తులకు అభయమిచ్చారు.

ముందుగా స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. విద్యుద్దీపాలతో స‌ర్వాంగ సుంద‌రంగా అలంకరించిన తెప్పపై రాత్రి 7 గంటల నుండి 8 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు ఆశీనులై పుష్కరిణిలో ఐదు చుట్లు విహరించి భ‌క్తుల‌ను అనుగ్ర‌హించారు. 

మంగళవాయిద్యాలు‌, వేదపండితుల వేదపారాయ‌ణం, అన్నమాచార్య ప్రాజెక్టు క‌ళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్ర‌ప‌ర్వంగా జరిగింది.

ఈ తెప్పోత్సవంలో తిరుమల శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి, అదనపు ఈఓ శ్రీ వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, పేష్కార్ శ్రీ రామ కృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.