SRI PRASANNA VENKATESWARA SWAMY BLESSES DEVOTEES ON KALPAVRIKSHA VAHANAM _ కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో దివ్య మంగళ దర్శనం
Tirupati, June 28, 2026: As part of the annual Brahmotsavams at Appalayagunta, Sri Prasanna Venkateswara Swamy blessed devotees on Kalpavriksha Vahanam in Rajamannar Alankaram on Sunday morning.
The Vahana Seva commenced at 8 am amid chants of “Govinda.” Devotees offered Karpura Harathi and had the divine darshan of the Lord. Snapana Tirumanjanam was performed from 9.30 am to 11 am.
The Arjita Kalyanotsavam will be held from 4.30 pm to 6.30 pm after the Lord’s ceremonial procession to the Kalyana Mandapam. In the evening at 7 pm, Sri Swamy will bless devotees on Sarvabhoopala Vahanam.
Deputy EO Sri Harindranath, AEO Sri Devarajulu, Superintendent Smt. Srivani, Temple Inspector Sri Venugopal, priests, officials, and Srivari Sevaks participated in the Vahana Seva.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో దివ్య మంగళ దర్శనం
భక్తుల కోర్కెలు తీర్చే కల్పవృక్ష స్వరూపుడిగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి
తిరుపతి, 2026 జూన్ 28: అప్పలాయగుంటలో జరుగుతున్న శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం స్వామివారు రాజమన్నార్ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై విచ్చేసి భక్తులకు దివ్య మంగళ దర్శనమిచ్చారు.
ఉదయం 8 గంటలకు ప్రారంభమైన వాహనసేవలో గోవింద నామస్మరణల మధ్య స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించారు. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి భక్తిశ్రద్ధలతో దర్శించుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొందారు.
అనంతరం ఉదయం 9.30 నుండి 11 గంటల వరకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు.
సాయంత్రం 4 నుండి 4.30 గంటల వరకు కళ్యాణ మండపానికి శ్రీవారు వేంచేపు చేయగా, 4.30 నుండి 6.30 గంటల వరకు ఆర్జిత కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతుంది. ఈ మహోత్సవాన్ని అధిక సంఖ్యలో భక్తులు వీక్షించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది.
అదే రోజు రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనంపై స్వామివారు భక్తులను ఆశీర్వదించనున్నారు.
ఈ వాహనసేవలో డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ వేణుగోపాల్, అర్చకులు, అధికారులు, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.







