SUNDARARAJA SWAMY TEPPOTSAVAMS IN EKANTAM HELD _ తిరుచానూరులో శ్రీ సుందరరాజస్వామివారికి అభిషేకం
Tiruchanoor, 21 Jun. 21: On the second day of the annual Teppotsavams in Tiruchanoor temple, Abhishekam was performed to Sri Sundara Raja Swamy in Ekantam in view of Covid guidelines on Monday.
The Abhishekam was performed in Sri Krishna Mukha Mandapam between 2pm and 4:30pm.
Temple DyEO Smt Kasturi Bai and others participated.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
తిరుచానూరులో శ్రీ సుందరరాజస్వామివారికి అభిషేకం
తిరుపతి, 2021 జూన్ 21: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలలో భాగంగా రెండవ రోజైన సోమవారం శ్రీ సుందరరాజస్వామివారికి అభిషేకం జరిగింది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 నుండి 4.00 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామివారి ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, ఇతర సుగంధ ద్రవ్యాలతో ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు.
కాగా జూన్ 22 నుండి 24వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవ మూర్తులకు అభిషేకం నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి కస్తూరి బాయి, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, సూపరింటెండెంట్ శ్రీ శేషగిరి, ఆలయ అర్చకులు శ్రీ బాబుస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ రాజేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.