TTD CONTINUES TO SUPPORT PRESERVATION OF ARTS: TIRUPATI MLA SRI ARANI SRINIVASULU _ కళల పరిరక్షణకు టీటీడీ నిరంతర ప్రోత్సాహం : తిరుపతి ఎమ్మెల్యే శ్రీ అరణి శ్రీనివాసులు

Tirupati, August 3, 2026: The 72nd National Drama Festival of Sri Venkateswara Natya Kalaparishat began grandly at Mahathi Kalakshetram in Tirupati on Monday.

Speaking as the chief guest, Tirupati MLA Sri Arani Srinivasulu said TTD has been consistently encouraging and preserving Indian arts and culture. He appreciated TTD for extending financial assistance of Rs. 25 lakh, which helped revive the drama festival after a gap of six years. He expressed hope that TTD would continue supporting artists and cultural activities.

AP Greening and Beautification Corporation Chairperson Smt. Sugunamma urged art lovers to participate in the 10-day festival in large numbers and suggested reviving regular mythological and social drama performances in Tirupati.

TTD Hindu Dharma Prachara Parishad Secretary Dr. Medasani Mohan said art and culture flourish in a society that values artists, while TTD Chief Public Relations Officer Dr. T. Ravi highlighted TTD’s efforts in promoting music, drama and cultural heritage through various projects and institutions.

Several dignitaries, artists, cultural enthusiasts and members of the public attended the inaugural programme.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI 

కళల పరిరక్షణకు టీటీడీ నిరంతర ప్రోత్సాహం : తిరుపతి ఎమ్మెల్యే శ్రీ అరణి శ్రీనివాసులు

•  శ్రీ వేంకటేశ్వర నాట్య కళాపరిషత్తు 72 జాతీయ నాటకోత్సవాలు ఘనంగా ప్రారంభం

తిరుపతి, 2026 ఆగస్టు 3: తిరుపతి ఆధ్యాత్మికతకు మాత్రమే కాకుండా భారతీయ కళలు, సంస్కృతికి నిలయమని, కళలను పరిరక్షించి ప్రోత్సహించే ప్రతి సంస్థకు టీటీడీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని తిరుపతి ఎమ్మెల్యే శ్రీ అరణి శ్రీనివాసులు తెలిపారు.

తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సోమవారం ప్రారంభమైన శ్రీ వేంకటేశ్వర నాట్య కళాపరిషత్తు 72వ జాతీయ నాటకోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కళాకారులకు అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వం, టీటీడీ నిరంతరం కట్టుబడి ఉన్నాయని తెలిపారు. పౌరాణిక, సాంఘిక నాటకాలు, ఏకపాత్రాభినయం, లలిత సంగీత పోటీల నిర్వహణ అభినందనీయమన్నారు. గత ఆరు సంవత్సరాలుగా నిలిచిపోయిన నాటకోత్సవాలను ఈ ఏడాది టీటీడీ అందించిన రూ.25 లక్షల ఆర్థిక సహకారంతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులోనూ కళలకు, కళాకారులకు టీటీడీ ఇదే విధంగా అండగా నిలవాలని ఆకాంక్షించారు.

ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ శ్రీమతి సుగుణమ్మ మాట్లాడుతూ, శ్రీ వేంకటేశ్వర నాట్య కళాపరిషత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గరుడ అవార్డులు ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి కళాకారులు ఈ నాటకోత్సవాల్లో పాల్గొనడం ఆనందదాయకమన్నారు. గతంలో తిరుపతిలో ప్రతి నెల పౌరాణిక నాటకాలు ప్రదర్శించే సంప్రదాయాన్ని పునరుద్ధరించి, కనీసం నెలకు ఒక పౌరాణిక లేదా ఒక సాంఘిక నాటకాన్ని ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులను కోరారు. పది రోజులపాటు నిర్వహించే ఈ నాటకోత్సవాల్లో కళాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి డాక్టర్ మేడసాని మోహన్ మాట్లాడుతూ, కళలను ఆదరించే సమాజంలోనే సంస్కృతి, సాంప్రదాయాలు, సుఖశాంతులు వర్ధిల్లుతాయని పేర్కొన్నారు. కళాకారులు, కళాపోషకులకు టీటీడీలో సేవ చేసే అవకాశం దక్కడం పూర్వజన్మ సుకృతమన్నారు. కళలను పరిరక్షించి ప్రోత్సహించిన పాలకులు చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని వివరించారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారి డాక్టర్ టి. రవి మాట్లాడుతూ, హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య, దాససాహిత్య ప్రాజెక్టుల ద్వారా టీటీడీ కళాకారులకు విశేష ప్రోత్సాహం అందిస్తోందన్నారు. ఎస్‌వీ సంగీత, నృత్య కళాశాల, నాదనీరాజనం, ఎస్‌వీబీసీ వంటి వేదికల ద్వారా సంగీత, నాటక, సాంస్కృతిక రంగాలకు మరింత ఊతమిస్తున్నామని తెలిపారు. తిరుపతి, తిరుమలలో ఎస్‌వీబీసీ ఆధ్వర్యంలో ప్రతి వారం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే అవకాశాలను టీటీడీ పరిశీలిస్తోందని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ వేంకటేశ్వర నాట్య కళాపరిషత్ గౌరవాధ్యక్షులు శ్రీ చిన్నంగారి రమణ వ్యాఖ్యాతగా వ్యవహరించగా, కార్యదర్శి శ్రీ మునిరత్నం, నగర ప్రముఖులు శ్రీ మబ్బు సూర్యనారాయణ రెడ్డి, శ్రీ కుమారస్వామి రెడ్డి, కళాపరిషత్ ప్రతినిధులు, కళాకారులు, కళాభిమానులు, పెద్ద సంఖ్యలో పురప్రజలు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది