TTD MAKES ELABORATE ARRANGEMENTS FOR SRI PADMAVATHI AMMAVARI TEPPOTSAVAMS _ తిరుచానూరులో అమ్మవారి తెప్పోత్సవాలకు సర్వాంగ సుందర ఏర్పాట్లు

Tirupati, June 19, 2026: TTD has made elaborate arrangements for the annual Sri Padmavathi Ammavari Teppotsavams to be held at Tiruchanoor from June 25 to 29. TTD JEO Dr. A. Sarat reviewed the arrangements on Friday and directed officials to ensure smooth conduct of the festivities and provide all facilities to devotees.

He instructed officials to focus on security, sanitation, drinking water, power supply and darshan arrangements. The fitness of the floats will be thoroughly checked and trial runs conducted. The floats will also be beautifully decorated with flowers and illumination.

Special spiritual and cultural programmes, including devotional music concerts, discourses and bhajans, will be organised during the five-day festival.

The Teppotsavams will feature Sri Krishna Swamy on June 25, Sri Sundararaja Swamy on June 26, and Sri Padmavathi Ammavaru from June 27 to 29. Gaja Vahanam and Garuda Vahanam processions on June 28 and 29 respectively will be major attractions.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుచానూరులో అమ్మవారి తెప్పోత్సవాలకు సర్వాంగ సుందర ఏర్పాట్లు
 
జూన్ 25 నుంచి 29 వరకు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు వైభవంగా నిర్వహణ
 
ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ జేఈవో డా. ఎ. శరత్
 
తిరుపతి, 2026 జూన్ 19 ; తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జూన్ 25 నుండి 29వ తేదీ వరకు నిర్వహించనున్న తెప్పోత్సవాల ఏర్పాట్లను టిటిడి జేఈవో డా. ఎ. శరత్ శుక్రవారం అధికారుల‌తో క‌లిసి పరిశీలించారు. ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
 
ఈ సందర్భంగా టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ శుక్రవారం ఆలయ అధికారులతో కలిసి ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఉత్సవాలకు విచ్చేసే వేలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రత, పారిశుద్ధ్యం, విద్యుత్, తాగునీరు, దర్శన సౌకర్యాలు తదితర అంశాల్లో పకడ్బందీ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
 
తెప్పోత్సవాల్లో వినియోగించే తెప్పల ఫిట్‌నెస్‌ను పూర్తిగా పరిశీలించి ట్రయల్ రన్ నిర్వహించాలని జేఈవో సూచించారు. అలాగే విద్యుద్దీపాల కాంతులతో, పుష్పాల అలంకరణలతో తెప్పలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.
 
ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంగీత కచేరీలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, భజనలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జేఈవో తెలిపారు. ఈ కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మికానందాన్ని పంచనున్నాయని పేర్కొన్నారు. అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ పద్మావతి అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని జేఈవో భక్తులను కోరారు.
 
ఉత్సవాల విశేషాలు
జూన్ 25
 
రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామివారి తెప్పోత్సవం
 
జూన్ 26
 
శ్రీ సుందరరాజస్వామివారి తెప్పోత్సవం
 
జూన్ 27 నుంచి 29 వరకు
 
శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవం
 
గజవాహన, గరుడవాహన సేవలు ప్రత్యేక ఆకర్షణ
 
జూన్ 28వ తేదీ రాత్రి 8.30 గంటలకు గజవాహన సేవ, జూన్ 29వ తేదీ రాత్రి 8.30 గంటలకు గరుడవాహన సేవ అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. అనంతరం ప్రతిరోజూ ఆలయ మాడవీధుల్లో అమ్మవారి ఉత్సవమూర్తుల ఊరేగింపు భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తనుంది.
 
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఎస్‌ఈలు శ్రీ వెంకటేశ్వర్లు, శ్రీ నరసింహమూర్తి, విజివో శ్రీ గిరిధర్ తదితర అధికారులు పాల్గొన్నారు.
 
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల