ఆగస్టు 10న తిరుచానూరు శ్రీకృష్ణస్వామి ఆలయంలో గోకులాష్టమి

ఆగస్టు 10న తిరుచానూరు శ్రీకృష్ణస్వామి ఆలయంలో గోకులాష్టమి

 తిరుపతి, 20012 ఆగస్టు 7: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీకృష్ణస్వామి వారి ఆలయంలో ఆగస్టు 10వ తేదీన గోకులాష్టమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మొదటిరోజు గోకులాష్టమి ఆస్థానం, రెండో రోజు ఉట్లోత్సవం నిర్వహించనున్నారు.

గోకులాష్టమి రోజైన శుక్రవారం ఉదయం శ్రీకృష్ణస్వామి మూలవర్లకు అభిషేకం, మధ్యాహ్నం స్నపన తిరుమంజనం, సాయంత్రం స్వామివారికి ఊంజల్‌సేవ, ఆస్థానం నిర్వహిస్తారు. అనంతరం స్వామివారు పెద్దశేష వాహనాన్ని అధిష్టించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు. అదేవిధంగా శనివారం ఉట్లోత్సవం వైభవంగా జరుగనుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.