ఆగ‌స్టు 17,18వ తేదీల్లో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 193వ వర్థంతి వేడుకలు                            

ఆగ‌స్టు 17,18వ తేదీల్లో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 193వ వర్థంతి వేడుకలు                            

తిరుపతి, 2010 ఆగష్టు 16: భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 193వ వర్థంతి వేడుకలు ఈ నెల 17,18వ తేదీలలో తిరుమల,తిరుపతి, తరిగొండలలో ఘనంగా జరుగుతాయి. రెండురోజుల పాటు జరిగే కార్యక్రమాలు ఈ క్రింది విధంగా ఉంటాయి.

తిరుపతిలో ….  17-08-2010  

ఉదయం 10.00 – అన్నమాచార్య కళామందిరంలో వెంగమాంబ జీవితగాథ పై సెమినార్‌

సాయత్రం 6.00 – లాస్యప్రియ డ్యాన్స్‌ అకాడమి వారిచే నృత్యకార్యక్రమాలు

తరిగొండలో …..17-08-2010

సాయంత్రం6.00 గం||లకు – అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో హరికథ

18-08-2010

ఉదయం 9.00 గం||లకు -వెంగమాంబ సమాధివద్ద తితిదే చైర్మన్‌, ఇ.ఓలు పుష్పాంజలి సమర్పణ

తిరుపతిలో ….

ఉదయం 11.30 –  వెంగమాంబ విగ్రహం వద్ద తితిదే ఛైర్మన్‌, ఇ.ఓలు పుష్పాంజలి సమర్పణ

సాయంత్రం 6.00-  అన్నమాచార్య కళామందిరంలో వెంగమాంబ జీవిత చరిత్రపై నాట‌క ప్ర‌దర్శన

తరిగొండ….

సాయంత్రం 6.00గం||లకు లక్షినరసింహ స్వామికళ్యాణోత్సవం

సాయంత్రం 7.00 గం||లకు అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో సంగీత కచేరి.

తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 20వ తేదిన వరలక్ష్మి వ్రతం వైభవంగా జరుగుతుంది. ఆర్జితంగా జరిగే ఈ పూజలో రూ.500/- చెల్లించి ఇద్దరు పాల్గొనవచ్చును.

అదేవిధంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో 20వ తేదిన వరలక్షి వ్రతం ఘనంగా జరుగుతుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.