ఆగస్టు 25 నుండి తమిళనాట శ్రీనివాస కళ్యాణాలు

ఆగస్టు 25 నుండి తమిళనాట శ్రీనివాస కళ్యాణాలు

తిరుపతి, 2012 ఆగస్టు 24: తితిదే శ్రీ కళ్యాణోత్సవం ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 25వ తేదీ నుండి తమిళనాడు రాష్ట్రంలో నాలుగు చోట్ల శ్రీనివాస కళ్యాణాలను వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీకృష్ణబలరామ సేవాట్రస్టు ఆధ్వర్యంలో ఆగస్టు 25వ తేదీన మధురై నగరంలో, ఆగస్టు 26వ తేదీన తిరునల్వేలి నగరంలో స్వామివారి కళ్యాణాలు ఘనంగా జరుగనున్నాయి.

అదేవిధంగా చిన్న మైనర్‌ బాలన్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆగస్టు 29వ తేదీన దేవకోట్టైలో, ఆగస్టు 30వ తేదీన కారైక్కుడిలో శ్రీవారి కళ్యాణాలను కన్నులపండువగా నిర్వహించనున్నారు. శ్రీ కళ్యాణోత్సవం ప్రాజెక్టు ఓఎస్‌డి శ్రీ కె.రామకృష్ణ ఈ కళ్యాణోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. శ్రీవారి కళ్యాణోత్సవాల సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.