ఘనంగా అన్నమయ్య దినము ద్వాదశి

ఘనంగా అన్నమయ్య దినము ద్వాదశి

తిరుపతి, 2012 సెప్టెంబరు 13: పరమపవిత్రమైన ద్వాదశి తిథినాడు పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు శ్రీవారిలో ఐక్యమైన మహత్తర సందర్భాన్ని పురస్కరించుకుని తితిదే గురువారం నాడు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ‘అన్నమయ్య దినము ద్వాదశి’ని ఘనంగా నిర్వహించింది.

       ఈ సందర్భంగా ఉదయం 10.30 గంటలకు దినము ద్వాదశి సంకీర్తనలతో అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గోష్ఠిగానం నిర్వహించారు. ఉదయం 11.30 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్టు హరికథ కళాకారిణి శ్రీమతి జంధ్యాల క్రిష్ణకుమారి  హరికథా పారాయణం చేశారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.

సాయంత్రం 6.00 గంటలకు తిరుపతికి చెందిన ఆచార్య జి.దామోదరనాయుడు ”అన్నమయ్య వ్యక్తిత్వం” అనే అంశంపై ఉపన్యసించనున్నారు. రాత్రి 7.00 గంటలకు తిరుపతికి చెందిన శ్రీమతి బి.పద్మావతి గాత్ర సంగీత సభ నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్‌ మేడసాని మోహన్‌, ప్రోగ్రాం కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ కె.వాణి, ఇతర అధికారులు, విశేషసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
          
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.