జూన్‌21, 22వ తేదీల్లో మ‌హాతిలో ”పాండురంగ మహత్యము” చిత్ర ప్ర‌ద‌ర్శ‌న‌

జూన్‌21, 22వ తేదీల్లో మ‌హాతిలో  ”పాండురంగ మహత్యము” చిత్ర ప్ర‌ద‌ర్శ‌న‌

తిరుపతి, జూన్‌-20, 2008: శ్రీవారికి చిత్రహారతి కార్యక్రమంలో భాగంగా స్థానిక మహాతి ఆడిటోరియం నందు జూన్‌21, 22వ తేదిలలో సాయంత్రం 6 గంటలకు ఎన్‌.టి.ఆర్‌, అంజలీదేవి తదితరులు నటించిన ”పాండురంగ మహత్యము” ఉచితంగా ప్రదర్శిస్తారు. ఈ చిత్రానికి శ్రీకమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించారు.

కనుక పురప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడమైనది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.