జూలై 12న‌ డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

జూలై 12న‌ డ‌య‌ల్ యువ‌ర్ ఈవో
 
తిరుమల, 2020 జూలై 10: డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం జూలై 12వ తేదీన ఆదివారం తిరుప‌తిలోని టిటిడి పరిపాలన భవనంలో గల సమావేశ మందిరంలో జరుగనుంది. ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మం ఉంటుంది.
 
ఈ  కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.