జూలై 26, 27 తేదీల్లో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 195వ వర్ధంతి ఉత్సవాలు

జూలై 26, 27 తేదీల్లో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 195వ వర్ధంతి ఉత్సవాలు

తిరుపతి, 2012 జూలై 12: శ్రీ వేంకటేశ్వరస్వామికి అపర భక్తురాలైన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 195వ వర్ధంతి ఉత్సవాలు జూలై 26, 27వ తేదీల్లో తిరుమల, తిరుపతి, తరిగొండలలో ఘనంగా జరుగనున్నాయి.

తరిగొండ ఆలయంలో జూలై 26వ తేదీ సాయంత్రం 6.30 గంటల నుండి 8.30 గంటల వరకు ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదేవిధంగా జూలై 27వ సాయంత్రం 6.00 గంటల నుండి రాత్రి 8.00 గంటల వరకు శ్రీ లక్ష్మీనృసింహస్వామివారికి కళ్యాణోత్సవం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.

తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో జూలై 26వ తేదీన ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు తరిగొండ వెంగమాంబ సాహిత్యంపై సదస్సు నిర్వహించనున్నారు. అదేరోజు సాయంత్రం 6.30 గంటల నుండి 8.30 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదేవిధంగా జూలై 27వ తేదీ ఉదయం 11.30 గంటలకు  ఎం.ఆర్‌.పల్లి సర్కిల్‌ వద్ద ఉన్న తరిగొండ వెంగమాంబ విగ్రహానికి తితిదే అధికారులు పుష్పాంజలి ఘటిస్తారు. సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 9.00 గంటల వరకు అన్నమాచార్య కళామందిరంలో ప్రముఖ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జూలై 27వ తేదీన తిరుమలలోని తరిగొండ వెంగమాంబ బృందావనంలో పుష్పాంజలి సమర్పించ నున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.