జూలై 27న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీవ్రతం 

జూలై 27న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీవ్రతం

తిరుపతి, 2012 జూలై 11: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జూలై 27వ తేదీన వరలక్ష్ష్మీ వ్రతం వైభవంగా జరుగనుంది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించ నున్నారు. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- టికెట్‌ కొనుగోలుచేసి వరలక్ష్మీ వ్రతం ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక వడ బహుమానంగా అందజేస్తారు. ఈ టికెట్లు అన్ని తితిదే ఈ-దర్శన్‌ కౌంటర్లలో అందుబాటులో ఉంటాయి.

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సాయంత్రం అమ్మవారు స్వర్ణరథంపై మాడ వీధుల్లో విహరించి భక్తులకు కనులవిందుగా దర్శనమిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో ఆర్జితసేవలైన లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను రద్దు చేయనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.