నవంబరు 1,2 తేదీలలో  మెట్లోత్సవం

నవంబరు 1,2 తేదీలలో  మెట్లోత్సవం

తిరుపతి, అక్టోబర్‌-31,  2009: తిరుమల తిరుపతి దేవస్థానములు దాససాహిత్యప్రాజెక్టు ఆధ్వర్యంలో నవంబరు 1,2 తేదీలలో తిరుమల ఆస్థానమండపం, శ్రీనివాస మంగాపురం వద్దనున్న శ్రీవారి మెట్టువద్ద రెండు రోజులపాటు  బాల బాలికలచే మెట్లోత్సవం ఘనంగా నిర్వహిస్తారు.

తితిదే దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించనున్న ఈ బాల బాలికల శ్రీవారి మెట్లోత్సవ కార్యక్రమంలో మొదటి రోజు అయిన నవంబరు 1వ తేదిన ఉదయం 6.00 గంటల నుండి సాయంత్రం వరకు తిరుమల ఆస్థానమండపంలో సంకీర్తనలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు వుంటాయి. నవంబరు 2వ తేదిన ఉదయం 5.30 గంటలకు శ్రీనివాసమంగాపురం వద్దనున్న శ్రీవారి మెట్టు నుండి మెట్లోత్సవం ప్రారంభం అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి విచ్చేయనున్న దాదాపు 2000 మంది బాల బాలికలు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా మెట్లుకు పూజ చేస్తూ తిరుమలకు చేరుకుంటారు. 2వ తేది సాయంత్రం 2000 మంది పిల్లలు శ్రీవారి పుష్కరిణి చుట్టూ సంకీర్తనలను ఆలపిస్తూ దీపాలతో పుష్కరిణికి హారతి ఇస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.