నారాయణవనంలో  రథసప్తమి

నారాయణవనంలో  రథసప్తమి

తిరుపతి, ఫిబ్రవరి 12,2013  : నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం 6.00 గంటలకు సూర్యప్రభ వాహనంతో వాహన సేవలు ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 1.00 గంట వరకు హంస, కల్పవృక్ష, చిన్నశేష, పెద్దశేష వాహనాలపై స్వామివారు భక్తులను కటాక్షించనున్నారు. అనంతరం తిరుచ్చి ఉత్సవం జరుగనుంది. సాయంత్రం 6.00 గంటల నుండి 8.00 గంటల వరకు చంద్రప్రభ వాహనసేవ నిర్వహించనున్నారు.
కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో 6.00 గంటల నుండి 7.00 గంటల వరకు స్వామివారికి తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు.
నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో ఉదయం 6.00 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు సూర్యప్రభ, హంస, కల్పవృక్షవాహన సేవలు, తిరుచ్చి ఉత్సవం జరుగనున్నాయి. సాయంత్రం 4.00 గంటల నుండి 8.00 గంటల వరకు శేషవాహనం, చంద్రప్రభ వాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
 
ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ సప్తమి సూర్యజయంతిని పురస్కరించుకొని తితిదే స్థానిక ఆలయాల్లో రథసప్తమి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఆరోజు ఉదయం భానుని తొలిరేఖలు సూర్యప్రభ వాహనంలో కొలువైన శ్రీవారి లలాటపలకం, నాభి, పాదకమలాలపై ప్రసరించే అద్భుత దృశ్యాన్ని తిలకించడానికి భక్తులు వేయికళ్లతో ఎదురుచూస్తుంటారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.