ఫిబ్ర‌వ‌రి 20న 10 వేల మంది విద్యార్థుల‌తో మ‌హాస‌ర‌స్వ‌తియాగం

ఫిబ్ర‌వ‌రి 20న 10 వేల మంది విద్యార్థుల‌తో మ‌హాస‌ర‌స్వ‌తియాగం

ఫిబ్రవరి 17, తిరుపతి, 2020: ధ‌ర్మ‌ప్ర‌చారంలో భాగంగా టిటిడి హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్, విద్యా విభాగం సంయుక్తాధ్వ‌ర్యంలో ఫిబ్ర‌వ‌రి 20న తిరుప‌తిలోని గీతాజ‌యంతి మైదానంలో(ఎస్వీ హైస్కూల్ మైదానం) సుమారు 10 వేల మంది విద్యార్థులతో మ‌హాస‌ర‌స్వ‌తి యాగం నిర్వ‌హించ‌నున్నారు. ఉద‌యం 6 నుండి 11 గంట‌ల వ‌ర‌కు అనుజ్ఞ పుణ్యాహం, స‌ర‌స్వ‌తీ దేవి ఆరాధ‌న‌, క‌ల‌శారాధ‌న‌, మ‌హాస‌ర‌స్వ‌తీ యాగం, పూర్ణాహుతి త‌దిత‌ర కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు. త్వ‌ర‌లో జ‌రుగ‌నున్న వార్షిక‌ ప‌రీక్ష‌లకు హాజ‌ర‌య్యే విద్యార్థిని విద్యార్థులు విజ‌యం సాధించాల‌ని శ్రీ స‌ర‌స్వ‌తి అమ్మ‌వారిని ప్రార్థించేందుకు ఈ యాగం త‌ల‌పెట్టారు.

టిటిడి విద్యాసంస్థ‌లు, ప్ర‌భుత్వ విద్యాసంస్థ‌లు, ధార్మిక సంస్థ‌ల్లో 8, 9, 10 త‌ర‌గ‌తులు, ఇంట‌ర్‌, డిగ్రీ చ‌దువుతున్న విద్యార్థిని విదార్థులు ఈ యాగంలో పాల్గొన‌వ‌చ్చు. పూర్ణాహుతి  స‌మ‌యంలో ప‌ఠించేందుకు వీలుగా విద్యార్థుల‌కు స‌ర‌స్వ‌తి మంత్రం కాపీల‌ను స‌ర‌ఫ‌రా చేస్తారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ముఖ పండితుల‌తో ఉప‌న్యాస కార్య‌క్రమం ఉంటుంది. పాల్గొన్న విద్యార్థులంద‌రికీ విద్యాకంక‌ణం, పుస్త‌కం, పెన్ను అందజేస్తారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.