ఫిబ్రవరి 23 నుండి మార్చి 2వ తేదీ వరకు తొండమనాడులోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు
ఫిబ్రవరి 23 నుండి మార్చి 2వ తేదీ వరకు తొండమనాడులోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 2020 ఫిబ్రవరి 22: టిటిడికి అనుబంధంగా ఉన్న తొండమనాడులోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 23 నుండి మార్చి 2వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఇందుకోసం శనివారం సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు అంకురార్పణ నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం స్వామి, అమ్మవార్లకు అభిషేకం, రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి.
కాగా, ఫిబ్రవరి 27న సాయంత్రం 5 నుండి రాత్రి 7 గంటల వరకు ఆలయంలో కల్యాణోత్సవం వైభవంగా జరుగనుంది. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. మార్చి 3వ తేదీ సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయంలో పుష్పయాగం ఘనంగా జరుగనుంది. ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
వాహనసేవల వివరాలు :
తేదీ ఉదయం సాయంత్రం
23-02-2020(ఆదివారం) ధ్వజారోహణం శేష వాహనం
24-02-2020(సోమవారం) ——- హంస వాహనం
25-02-2020(మంగళవారం) ——– సింహ వాహనం
26-02-2020(బుధవారం) ——- హనుమంతవాహనం
27-02-2020(గురువారం) ——– కళ్యాణోత్సవం, గరుడవాహనం
28-02-2020(శుక్రవారం) ——- గజ వాహనం
29-02-2020(శనివారం) ——- చంద్రప్రభ వాహనం
01-03-2020(ఆదివారం) తిరుచ్చి ఉత్సవం అశ్వవాహనం
02-03-2020(సోమవారం) చక్రస్నానం ధ్వజావరోహణం.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.