భజన మండళ్ల నుండి దరఖాస్తుల ఆహ్వానం

భజన మండళ్ల నుండి దరఖాస్తుల ఆహ్వానం

తిరుపతి, మార్చి 25, 2013: తితిదే దాససాహిత్య ప్రాజెక్టు బెంగళూరు నగరంలోని భజన మండళ్ల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కొత్తగా సభ్యత్వం కావాల్సిన వారితోపాటు ఇదివరకు సభ్యత్వం ఉన్నవారు తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపిక చేసిన భజన మండళ్లు తితిదే నిర్వహించే ఉత్సవాలు, ప్రత్యేక పర్వదినాల్లో భజనలు, కోలాటాలు తదితర కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది.
పూర్తి చేసిన దరఖాస్తులను ఏప్రిల్‌ పదో తేదీ లోపు ”ప్రత్యేకాధికారి, దాససాహిత్య ప్రాజెక్టు , రూమ్‌ నంబరు 7, రెండో ఫ్లోర్‌, శ్రీదేవి కాంప్లెక్సు, తిలక్‌ రోడ్‌, తిరుపతి” అన్న చిరునామాకు పంపాల్సి ఉంటుంది.

సభ్యత్వం కోసం ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదని, మధ్యవర్తులను ఎవరినీ నమ్మవద్దని దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ పి.ఆర్‌.ఆనందతీర్థాచార్య తెలిపారు. ఇతర వివరాలకు 0877- 2264519, 09701288857 నంబర్లలో సంప్రదించవచ్చు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.