మార్చి 12వ తేదిన శ్రీకళ్యాణవెంకటేశ్వరస్వామివారి ఆల‌యంలో పుష్పయాగం

మార్చి 12వ తేదిన  శ్రీకళ్యాణవెంకటేశ్వరస్వామివారి ఆల‌యంలో పుష్పయాగం

తిరుపతి, 2010 ఫిబ్రవరి 25: శ్రీనివాసమంగాపురంలో వెలసిన శ్రీకళ్యాణవెంకటేశ్వరస్వామివారికి మార్చి 12వ తేదిన పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరుగుతుంది. మార్చి 11న అంకురార్పణం నిర్వహిస్తారు.

ప్రతి ఏడాది శ్రవణ నక్షత్రం పాల్గుణమాసంలో వార్షిక బ్రహ్మోత్సవాల అనంతరం శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి వారికి పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీ.
 
ఆరోజున వివిధ రకాల సుగంధపరిమళ పుష్పాలతో శ్రీవారిని అభిషేకిస్తారు. అనంతరం స్నపనతిరుమంజనం, హోమం, పూర్ణాహుతి నిర్వహిస్తారు. ఈపుష్పయాగంలో పాల్గొనదలచిన భక్తులు రు.516/-లు చెల్లించి ఇద్దరు వ్యక్తులు పాల్గొనవచ్చును. మరిన్ని వివరాలకు 0877-2264588 అను నెంబరుకు ఫోన్‌చేసి శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయం ఏ.ఇ.ఓ.ను సంప్రదించవచ్చును.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.