అక్టోబరు 5న డయల్‌ యువర్‌ ఈవో

అక్టోబరు 5న డయల్‌ యువర్‌ ఈవో

తిరుమల, 03 అక్టోబరు 2018: తిరుమలలోని అన్నమయ్య భవనంలో ప్రతినెలా మొదటి శుక్రవారం ఉదయం 8.30 గం||ల నుండి ఉదయం 9.30 గం||ల నడుమ నిర్వహించే డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం అక్టోబరు 5వ తేదీన జరుగనుంది. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

కాగా, 2019 జనవరి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఈ విషయాన్ని భక్తులు గమనించగలరని కోరడమైనది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.