GARUDA SEVA ON AUGUST 21 _ ఆగస్టు 21న గరుడ పంచమి

TIRUMALA, 20 AUGUST 2023: In connection with the auspicious Garuda Panchami on August 21, Garuda Seva will be observed between 7pm and 9pm in Tirumala.

Sri Malayappa Swamy will bless His devotees along four mada streets on the mighty Garuda Vahanam.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆగస్టు 21న గరుడ పంచమి

తిరుమల, 2023 ఆగస్టు 20: తిరుమ‌ల‌లో ఆగస్టు 21వ తేదీ సోమవారంనాడు గరుడ పంచమి పర్వదినం జ‌రుగ‌నుంది. ఈ సంద‌ర్భంగా రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారు త‌న‌కు ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించ‌నున్నారు. ఈ నెలలో స్వామివారు రెండో సారి గరుడ వాహనంపై దర్శనమివ్వనున్నారు.

ప్రతి ఏడాదీ తిరుమ‌ల‌లో గరుడ పంచమిని ఘనంగా నిర్వహిస్తారు. నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా బలశాలిగా, మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు ”గరుడపంచమి” పూజ చేస్తారని ప్రాశస్త్యం.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.