మార్చి 12 నుంచి ఉత్తరాది రాష్ట్రాలలో శ్రీనివాస కల్యాణాలు

మార్చి 12 నుంచి ఉత్తరాది రాష్ట్రాలలో శ్రీనివాస కల్యాణాలు

తిరుపతి, 2019 మార్చి 11: టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో మార్చి 12 నుండి 17వ తేది వరకు 3 ప్రాంతాలలో శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి. అన్నిచోట్లా మధ్యాహ్నం 12 గంటలకు కల్యాణాలు ప్రారంభంకానున్నాయి.

– మార్చి 12వ తేదిన ఢిల్లీలోని గూర్గాన్ లో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.

– మార్చి 14వ తేదిన ఢిల్లీలోని నోయిడాలో స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు.

– మార్చి 17వ తేదిన ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో శ్రీవారి కల్యాణం జరుగనుంది.

———————————————————————

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.