KANCHI SEER EXTENDS CONDOLENCE MESSAGE_ శ్రీ శేషాద్రి స్వామి మరణానికి కంచి స్వామి సంతాపం

TIRUMALA, 29 NOVEMBER 2021: HH Jagadguru Sri Vijayendra Saraswati Mahaswami of Kanchikamakoti Peetham, paid condolence over the demise of Srivari temple OSD Sri P Seshadri.

 

Extending a condolence message to TTD EO Dr KS Jawahar Reddy, he recalled the association of Sri P Seshadri with Kanchi Mutt. “The dedication and devotion of Sri Seshadri in the service of Sri Venkateswara Swamy lasting for almost 43 years was impeccable, he mentioned.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ శేషాద్రి స్వామి మరణానికి కంచి స్వామి సంతాపం

తిరుమల, 29 నవంబరు 2021: తిరుమల శ్రీవారి సేవలో  తరిస్తున్న శ్రీ పాల శేషాద్రి (డాలర్ శేషాద్రి) స్వామి మరణం టిటిడికి తీరని లోటని కంచి కామకోటి పీఠం ప్ర‌తినిధి సంతాప సందేశం పంపారు.

టిటిడి ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డికి సంతాప సందేశం ఇస్తూ కంచి మఠంతో శ్రీ పాల‌ శేషాద్రికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. శ్రీవేంకటేశ్వర స్వామి సేవలో దాదాపు 43 ఏళ్లపాటు కొనసాగిన శ్రీ శేషాద్రి అంకితభావం అమోఘమని పేర్కొన్నారు.

శ్రీవారి సేవే ఊపిరిగా ఆయన పని చేశారని, జీవితమంతా ఆలయ సేవలు, ఉత్సవాలు, కైంకర్యాలు, టిటిడి నిర్వహించే ఇతర వైదిక కార్యక్రమాల్లో స్వామివారికి విశేష‌ సేవ‌లు చేశార‌న్నారు.
       
ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ బాధను తట్టుకోగలిగే మానసిక ధైర్యం ప్రసాదించాలని స్వామివారిని ప్రార్థించిన‌ట్లు తెలిపారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది