PUSHPAYAGAM IN APPALAYAGUNTA ON JULY 28_ అప్పలాయగుంట శ్రీ ప్రసన్నవేంకటేశ్వరాలయ పుష్పయాగం గోడపత్రికల ఆవిష్కరణ

Tirupati, 21 July 2018: The annual pushpayagam in Sri Prasanna Venkateswara Swamy temple at Appalayagunta will be observed on July 28 and Tirupati JEO Sri P Bhaskar released the posters for the same in Tiruchanoor on Saturday.

Temple Spl Gr Dy E O Sri Munirathnam Reddy, Chief Engineer Sri Chandrasekhar Reddy, VGO Sri Ashok Kumar Goud, Temple Inspector Sri Srinivasa Raju were also present.

Meanwhile in connection with this religious event there will be Snapana Tirumanjanam will be performed to deities on July 28 morning followed by Pushpayagam between 3pm to 6pm on the same day evening.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అప్పలాయగుంట శ్రీ ప్రసన్నవేంకటేశ్వరాలయ పుష్పయాగం గోడపత్రికల ఆవిష్కరణ

తిరుపతి, 2018 జూలై 21: టిటిడికి అనుబంధంగా ఉన్న అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయ పుష్పయాగం గోడపత్రికలను శనివారం సాయంత్రం తిరుచానూరులో టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ జూలై 28వ తేదీన ఆలయంలో పుష్పయాగం జరుగనుందని తెలిపారు. ఈ ఆలయంలో జూన్‌ 23 నుంచి జూలై 1వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరిగాయన్నారు. ఈ ఉత్సవాల్లో ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారని వెల్లడించారు. తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో ఇక్కడ పుష్పయాగం నిర్వహిస్తామని, పరిసర ప్రాంతాల భక్తులు విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

కాగా, జూలై 28న శనివారం ఉదయం 11 నుండి 12 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారికి స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 నుండి 6 గంటల వరకు పుష్పయాగం కన్నులపండుగగా జరుగనుంది. ఇందులో పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఆ తరువాత వీధి ఉత్సవం నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి, స్థానికాలయాల ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ మునిరత్నంరెడ్డి, విజివో శ్రీ అశోక్ కుమార్ గౌడ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.