TTD ALL SET READY FOR 2012 ANNUAL SALAKATLA BRAHMOTSAVAMS-TTD EO _ 2012 _ శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం : తితిదే ఈవో

TIRUMALA, SEPT 16:  The world famous pilgrim town of Tirumala has geared up to celebrate the nine-day mega religious event of annual salakatla brahmotsavams of Lord Venakteswara which are scheduled to take place from 18th September to 26th September said TTD EO Sri LV Subramanyam.
 
Addressing the media persons over the elaborate arrangements made by TTD for annual brahmotsavams the EO said, the Hon’ble CM of AP will present silk vastrams to Lord Venkateswara on behalf of the State Government on the first day of Brahmotsavams which commences with Dhwajarohanam on September 18. “The CM will also lay foundation stone to second phase of Tiruvenkatapatham Ring road at Tirumala mulled at an estimated cost of Rs.11cr. Similarly he will also lay foundation stone to “Sri Vakulamatha” rest house which is coming up adjacent to Nandakam Guest House with an estimated cost of Rs.25cr”, he added.
 
Sri Subramanyam said TTD is planning to bring out Old Annaprasadam Complex for the utility of general pilgrims during Navarathri Brahmotsavams which are slated to start from October 15 to October 23. “We have constructed 116 Bath Rooms and 55 toilets for the sake of visiting pilgrims. This will be very useful to those pilgrims who come up with less baggage. Apart from this we are also planning to operate centralised cellphone and luggage keeping centre from this point and also to open up some laddu issuing counters so as to de-congest the pilgrim crowd near laddu counters”, he added.
 
Meanwhile the EO TTD will release a series of spiritual books, pamphlets on ancient coins. inscriptions, sacred teerthams during brahmotsavams. “CM will release all these books at the Nada Neerajana Mandapam”, he said.
 
Elaborating further on other arrangements the EO said, the RTC will run 3000 trips per day during brahmtosavams. “They will operate bus services every minute as in the case of last year. This year also we have put total ban on two-wheelers on Garuda Seva Day”, EO maintained.
 
“Thousands of bhajan mandalis will be taking part in this brahmotsavams showcasing their artistic skills in different guises. We are also expecting musical concerts by our Asthana Vidhwans Sri Nedanuri Krishnamurthy and Dr Managalampalli Balamurali Krishna. This year also we have grands plans for a colourful expo by garden, ayurveda, photo and museum departments to attract pilgrims”.
 
“On the security front, our vigilance and government police personnel have geared up to give full-fledged security cover. We are holding a buffer stock of 4lakhs laddus during brahmotsavams. The medical department has also taken up extra-measures in the case of any emergency situation”, the EO said. 
 
Later Tirumala JEO Sri KS Srinivasa Raju said, TTD has cancelled all arjitha sevas during brahmotsavams. “Even we have cancelled Rs.50 on Dhwajarohanam and Garuda Seva day. Even the issuance of Rs.300 tickets also depends upon the pilgrim crowd during brahmotsavams. The prime focus is on darshan to common pilgrims which commences from 6am till the end of the day every day. Even there are no VIP darshans on the evenings of 18th, 21st, 22nd, 23rd and 26th of September. 
 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం : తితిదే ఈవో

తిరుమల, 2012 సెప్టెంబరు 16: ఈ నెల 18 నుండి 26వ తారీఖు వరకు జరుగనున్న తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడమైనదని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం తెలిపారు. ఆదివారం ఉదయం ఆయన తిరుమలలోని అన్నమయ్య భవనంలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై మీడియాతో మాట్లాడారు.

తొలిరోజైన సెప్టెంబరు 18వ తారీఖున ధ్వజారోహణం కార్యక్రమాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ|| శ్రీ ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి తిరుమలకు విచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు కానుకగా సమర్పిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా వారి చేతులమీదుగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయించనున్నట్టు ఈవో వెల్లడించారు. అందులోభాగంగా రూ.11 కోట్లతో జిఎన్‌సి టోల్‌గేట్‌ వద్ద చేపట్టనున్న తిరువెంకటపథం రింగ్‌ రోడ్‌ రెండో విడత కార్యక్రమం, రూ.25 కోట్లతో నిర్మించనున్న శ్రీ వకుళామాత అతిథి భవనం శంకుస్థాపన కార్యక్రమాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొంటారని తెలిపారు. అంతేగాక స్వామి హుండీలో భక్తులు సమర్పించిన పురాతన నాణేలు, శాసనాలు, తీర్థాలు మొదలైన వాటి వైశిష్ట్యాన్ని తెలిపే కరపత్రాలను కూడా ముఖ్యమంత్రి చేతులమీదుగా ఆవిష్కరించడం జరుగుతుందన్నారు.

కాగా బ్రహ్మోత్సవాల సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్టు ఈవో తెలిపారు. ప్రతి నిమిషానికి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారు ఆర్‌టిసి బస్సులను నడపనున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రతిరోజూ దాదాపు మూడు వేల ట్రిప్పులు తిరుమల నుండి తిరుపతికి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

      భక్తుల కోసం నాలుగు లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచినట్టు వెల్లడించారు. ఈసారి బ్రహ్మోత్సవాల్లో తితిదే ఆస్థాన విద్వాంసులు శ్రీ నేదునూరి కృష్ణమూర్తి, డాక్టర్‌ మంగళంపల్లి బాలమురళికృష్ణతో సంగీత కచేరీలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో వివిధ కళాబృందాలు విభిన్న కళాకృతులను ప్రదర్శించనున్నట్టు వివరించారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలలోపు పాత అన్నప్రసాద భవనాన్ని పూర్తిస్థాయిలో భక్తులకు అందుబాటులోకి తెచ్చేందుకు యోచిస్తున్నట్టు తెలిపారు.

అనంతరం తిరుమల సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు మాట్లాడుతూ తిరుమలలో 18, 21, 22, 23, 26వ తారీఖుల్లో సాయంత్రం విఐపి బ్రేక్‌ దర్శనాన్ని రద్దు చేయనున్నట్టు తెలిపారు. అదేవిధంగా 18, 22వ తారీఖుల్లో రూ.50/- దర్శన టికెట్ల కేటాయింపును పూర్తిగా రద్దు చేస్తామన్నారు. ఇక రూ.300/- టికెట్లను సమయానుకూలంగా పరిస్థితులను బట్టి నిర్ణయిస్తామన్నారు. అలాగే ఆర్జిత సేవలను పూర్తిగా రద్దు చేయనున్నట్టు జెఈఓ తెలిపారు.

ఈ సమావేశంలో తితిదే ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

2012 శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు

దర్శనం :

1. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేయడమైనది.

2. ఉదయం, రాత్రి వాహనసేవల సమయాల్లో భక్తులు స్వామివారిని దర్శించుకోవడం మూలవిరాట్టు దర్శనంతో సమానమని పురాణభాష్యం.

3. వాహనాలపై స్వామివారిని ఊరేగించే సమయాల్లో భక్తులు దయచేసి నాణేలు విసరవద్దని మనవి.
4. గరుడ సేవ నాడు తిరుమలకు ద్విచక్రవాహనాలు నిషేధించడమైనది.

వసతి :

1. తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, సత్రాలలో వసతిని పొందవచ్చు.

భద్రత :

1. బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి ఆలయానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తితిదే నిఘా మరియు భద్రతా విభాగం, పోలీసు విభాగం సంయుక్తంగా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాయి.

2. చంటిపిల్లల భక్తులు జాగురూకతతో వ్యవహరించాలని మనవి.

3. మహిళా భక్తులు బంగారునగలు, విలువైన వస్తువులు తీసుకురాకూడదని విజ్ఞప్తి.

అన్నప్రసాదం :

1. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, ఎస్వీ గెస్ట్‌హౌస్‌, కంపార్ట్‌మెంట్లు, క్యూలైన్లు, కాలిబాట మార్గాల్లో భక్తులకు అన్నప్రసాద వితరణకు ఏర్పాట్లు.

2. గత ఏడాది రికార్డుస్థాయిలో ఒకేరోజు 1.12 లక్షల మందికి తితిదే అన్నప్రసాద వితరణ.

పారిశుద్ధ్యం :

1. తిరుమల అంతటా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచేందుకు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన చర్యలు చేపట్టారు.

రవాణా :

1. తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి నిమిషానికి ఒక బస్సు నడిపేందుకు ఆర్‌టిసి చర్యలు తీసుకుంది.

2. తిరుమలలో భక్తులను వివిధ ప్రాంతాలకు చేరవేసేందుకు ఆర్‌టిసి, తితిదే రవాణా విభాగం ఉచిత బస్సులు ఏర్పాటు చేయనున్నాయి.

వైద్యశాఖ :

1. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలోని 14 కేంద్రాల్లో అంటే వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2, ఎటిసి, కళ్యాణకట్ట, రాంభగీచా అతిథి గృహాలు, నిత్యాన్నదానం, పాపవినాశనం, అశ్విని ఆసుపత్రి, శ్రీవారి మెట్టు నడకమార్గం, అలిపిరి నడకమార్గం వంటి ప్రాంతాల్లో ప్రాథమిక అత్యవసర చికిత్స కేంద్రాలు ఏర్పాటు.

కళ్యాణకట్ట :

1. భక్తుల రద్దీ దృష్ట్యా కక్షురకులు అందుబాటులో ఉండేవిధంగా ప్రస్తుతం ఉన్న 600 మంది సిబ్బందే కాకుండా 1703 మంది కళ్యాణకట్ట సేవకులతో భక్తులకు ఉచితంగా తలనీలాలు తీసే సౌకర్యాన్ని తితిదే ఏర్పాటుచేసింది.

శ్రీవారి సేవకులు :

1. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సేవలందించేందుకు వీలుగా 4,000 మంది శ్రీవారి సేవకులు, 1,600 మంది స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ సేవలను తితిదే వినియోగించుకోనుంది.

సాంస్కృతిక కార్యక్రమాలు :

1. తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల  నాదనీరాజనం వేదిక ద్వారా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేయనున్నారు.

2. శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్‌ వాహన వైభవాన్ని, కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

వివిధ ప్రదర్శనలు :

1. భక్తులను ఆకర్షించేందుకు వీలుగా విభిన్న ఆకృతులతో ఫలపుష్ప ప్రదర్శనలు, తిరుమల దివ్యచరిత్రను తెలిపేలా ఛాయాచిత్రాల ప్రదర్శన, ఆయుర్వేదం తదితర ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు.

విద్యుద్దీపాలంకరణ :

1. భూలోక వైకుంఠంగా తిరుమల దివ్యక్షేత్రాన్ని ప్రస్ఫుటం చేస్తూ వివిధ పౌరాణిక అంశాలతో ఆకట్టుకునేలా విద్యుద్దీపాలంకరణలు ఏర్పాటుచేస్తోంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.