TTD CHAIRMAN PRESENTS 2 KG GOLD _ శ్రీ వారికి 2కిలోల 12 గ్రాముల 500 మిల్లీ గ్రాముల బంగారు కంఠా భరణం కానుకగా సమర్పించిన టీటీడీ చైర్మన్ దంపతులు

TIRUMALA, 18 DECEMBER 2022: TTD Chairman Sri YV Subba Reddy couple presented a gold Kantha Bharana to Sri Venkateswara Swamy on Sunday.

The ornament weighed 2 kgs 12 grams and 500 mg and they donated it on the occasion of the successful completion of Sri Srinivasa Viswashanti Yagam at Dharmagiri in Tirumala.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ వారికి 2కిలోల 12 గ్రాముల 500 మిల్లీ గ్రాముల బంగారు కంఠా భరణం కానుకగా సమర్పించిన టీటీడీ చైర్మన్ దంపతులు

తిరుమల 18 డిసెంబరు 2022: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి దంపతులు ఆదివారం 2కిలోల 12 గ్రాముల 500 మిల్లీ గ్రాముల శ్రీదేవి సమేత బంగారు కంఠాభరణాన్ని కానుకగా సమర్పించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ రమేష్ కు చైర్మన్ దంపతులు ఈ ఆభరణం అందించారు.

ప్రతి ఒక్కరు క్షేమంగా ఉండాలనే స్వామివారికి కానుక: టీటీడీ చైర్మన్ దంపతులు

విశ్వ శాంతి కోసం తిరుమల ధర్మగిరి వేద విద్యాపీఠం లో ఈ నెల 12నుండి 18వ తేదీ వరకు నిర్వహించిన శ్రీ శ్రీనివాస విశ్వశాంతి మహా యాగం ఆదివారం మహా పూర్ణాహుతితో విజయవంతంగా ముగిసిందని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, శ్రీమతి స్వర లత ఆనందం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి కొన్ని దేశాల్లో వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మన దేశంపై కరోనా ప్రభావం ఉండకూడదని, ప్రపంచంలోని ప్రజలే కాకుండా సకల జీవులు ఆరోగ్యాంగా ఉండాలని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ యాగం నిర్వహించామన్నారు. తిరుమలలో ఇప్పటి దాకా జరగని ఇలాంటి యాగం స్వామి వారి ఆశీస్సులతో తాము చేయించడం అదృష్టమని వారు చెప్పారు.

శ్రీ శ్రీనివాస మహా విశ్వ శాంతి యాగం విజయవంతంగా ముగిసినందువల్ల స్వామి వారికి కానుక సమర్పించామని చెప్పారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది