VISHNU ARCHANAM HELD _ వసంత మండపంలో ఆగమోక్తంగా విష్ణు అర్చనం

TIRUMALA, 10 JUNE 2022: On the auspicious day of Jyesta Suddha Ekadasi on Friday, Vishnu Archanam was held in Vasanta Mandapam at Tirumala.

SVBC has live telecasted the religious event between 3pm and 4:30pm.

Sri Krishna Moola Mantram and Gayatri Mantram were recited on the occasion.

Rukmini sameta Sri Krishna were placed in the Mandapam.

Archakas, scholars were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వసంత మండపంలో ఆగమోక్తంగా విష్ణు అర్చనం

తిరుమల, 2022 జూన్ 10: లోక కల్యాణార్థం టిటిడి నిర్వహిస్తున్న జ్యేష్ట‌ మాస కార్యక్రమాల్లో భాగంగా శుక్ర‌వారం తిరుమ‌ల వ‌సంత‌మండ‌పంలో విష్ణు అర్చ‌నం ఆగమోక్తంగా జరిగింది. జ్యేష్ట శుద్ధ‌ ఏకాద‌శి సంద‌ర్భంగా మ‌ధ్యాహ్నం 3 నుండి 4.30 గంట‌ల వ‌ర‌కు నిర్వహించిన ఈ పూజా కార్యక్రమాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసింది.

ప‌చ్చ‌ని తోర‌ణాలు, పుష్పాల‌తో ఆహ్లాదంగా తీర్చిదిద్దిన వ‌సంత మండ‌పంలో స్వ‌ర్ణ‌పీఠంపై శ్రీ రుక్మిణీ స‌మేతంగా కృష్ణ‌స్వామివారిని వేంచేపు చేశారు. అనంత‌రం పురాణ పండితులు శ్రీ రామ‌కృష్ణ శేష‌సాయి ఏకాద‌శి విశిష్ట‌త‌ను తెలియ‌జేశారు. ఆ త‌రువాత అర్చకస్వాములు, వేదపండితులు పారమాత్మికోపనిషత్ లోని శ్రీకృష్ణ మూల‌మంత్రం, గాయ‌త్రీ మంత్రాన్ని 24 సార్లు పఠించారు. పుష్పార్చ‌న చేసి తుల‌సీద‌ళాల‌తో స‌హ‌స్ర‌నామార్చ‌న చేప‌ట్టారు. నివేదన, హారతులు సమర్పించి క్షమాప్రార్థన చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో అర్చకస్వాములు, వేదపండితులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.