SOMASKANDA RIDES ADHIKARA NANDI VAHANAM _ అధికార నంది వాహ‌నంపై సోమస్కందమూర్తి

Tirupati, 26 Feb. 22: Sri Somaskanda Murty seated on Adhikara Nandi Vahanam and blessed devotees at Sri Kapileswara Swamy temple.

 

On the fifth day evening of the ongoing annual Brahmotsavams in Ekantam, Adhikara Nandi Vahanam took place on Saturday.

 

Temple DyEO Sri Subramanyam, AEO Sri Satre Naik, Superintendent Sri Bhupati and others were also present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

అధికార నంది వాహ‌నంపై సోమస్కందమూర్తి

తిరుపతి, 2022 ఫిబ్ర‌వ‌రి 26: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శ‌నివారం రాత్రి శ్రీ సోమస్కంధమూర్తి అధికార నంది వాహ‌నంపై అభ‌య‌మిచ్చారు. కోవిడ్ -19 నిబంధ‌న‌ల మేర‌కు వాహ‌న సేవ‌లు ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.

శ్రీ కపిలేశ్వరస్వామి వాహనసేవలలో విశిష్ఠమైనది అధికారనంది. ఈ అధికారనందికి నామాంతరం కైలాసనంది. కైలాసంలో మెడలో మువ్వలదండలతో, కాళ్లకు గజ్జెలతో మనోహరాకారంతో, బంగారుకొమ్ములతో అలరారే నంది భవుడికి నిత్యవాహనం.

వాహ‌న‌సేవ‌లో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, ఏఈవో స‌త్రేనాయ‌క్, సూపరింటెండెంట్‌ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ రెడ్డిశేఖ‌ర్‌, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.