ఆగ‌స్టు 30న ఎస్వీ గోశాలలో కోవిడ్ నిబంధ‌న‌ల మేర‌కు గోపూజ‌

ఆగ‌స్టు 30న ఎస్వీ గోశాలలో కోవిడ్ నిబంధ‌న‌ల మేర‌కు గోపూజ‌

తిరుప‌తి, 2021 ఆగ‌స్టు 10: ఆగ‌స్టు 30న గోకులాష్టమి సందర్భంగా తిరుప‌తిలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో ఉదయం 10.30 గంటలకు ‘గోపూజ మహోత్సవం’ జరుగనుంది. కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో నిబంధ‌న‌లు పాటిస్తూ ఈ కార్య‌క్రమం నిర్వహిస్తారు.

భారతీయ సంస్కృతిలో గోవుకు ప్రముఖ స్థానం ఉంది. గోవును హిందువులు గోమాతగా పూజిస్తారు. గోపూజ‌ వల్ల పాడిపంటలు వృద్ధి చెంది దేశం సస్యశ్యామలం అవుతుందని భ‌క్తుల నమ్మకం. ఈ సంద‌ర్భంగా గోవుల‌ను ప్ర‌త్యేకంగా అలంక‌రించి అర్చ‌కులు పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.