ఏప్రిల్‌ 4న శ్రీ పద్మావతి అమ్మవారి గజవాహన సేవ

ఏప్రిల్‌ 4న శ్రీ పద్మావతి అమ్మవారి గజవాహన సేవ

తిరుపతి, ఏప్రిల్‌ 03, 2013: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏప్రిల్‌ 4వ తేదీన గజవాహన సేవ వైభవంగా జరుగనుంది. శ్రీ పద్మావతి అమ్మవారి జన్మదినమైన ఉత్తరాషాడ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రతినెలా గజవాహనోత్సవం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం రాత్రి 7.00 నుండి 8.00 గంటల వరకు సర్వాలంకారభూషితులైన అమ్మవారు గజ వాహనాన్ని అధిష్టించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించనున్నారు. ఇందుకోసం ఆలయాధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ఇష్టమైన గజవాహనసేవలో పాల్గొని తరించాలని కోరడమైనది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.