SAKALA KARYA SIDDHI RAMAYANA PARAYANAM FROM JULY 25 TO AUGUST 23 _ జులై 25 నుండి ఆగ‌స్టు 23వ‌తేదీ వ‌ర‌కు స‌క‌లకార్య‌సిద్ధి శ్రీ‌మ‌ద్ రామాయ‌ణ పారాయ‌ణం

TIRUMALA, 22 JULY 2021: As a part of a noble spiritual mission, TTD has embarked upon yet another innovative recitation, Sakala Karya Siddhi Ramayana Parayanam from July 25 to August 23 in Tirumala.

The chief aim of this Parayanam is that all the living beings should lead a peaceful and prosperous life. And all the activities which came to a stand still due to Covid pandemic across the globe, should resume without any further interruptions and disturbances.

The Ankurarpanam for this 30 daylong spiritual program will be performed in Dharmagiri Veda Vignana Peetham on Saturday, July 24.

The shlokas from some of the important chapters of Balakanda, Ayodhyakanda, Aranyakanda, Kishkindakanda, Sundarakanda, Yuddhakanda will be recited everyday in Vasanta Mandapam at Tirumala between 8:30am and 10am which will be telecasted live on SVBC for the sake of global devotees.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

జులై 25 నుండి ఆగ‌స్టు 23వ‌తేదీ వ‌ర‌కు స‌క‌లకార్య‌సిద్ధి శ్రీ‌మ‌ద్ రామాయ‌ణ పారాయ‌ణం

తిరుమల, 2021 జులై 22: శ్రీ‌వారి అనుగ్ర‌హంతో సృష్టిలోని స‌క‌ల జీవ‌రాశులు సుభిక్షంగా ఉండాల‌ని, అన్ని కార్య‌క్ర‌మాలు స‌జావుగా సాగాల‌ని కోరుకుంటూ జులై 25 నుండి ఆగ‌స్టు 23వ తేదీ వ‌ర‌కు తిరుమ‌ల‌లో స‌క‌లకార్య‌సిద్ధి శ్రీ‌మ‌ద్ రామాయ‌ణ పారాయ‌ణం జర‌గ‌నుంది. కోవిడ్ – 19 కార‌ణంగా నిలిచిపోయిన అన్ని కార్య‌క్ర‌మాలు తిరిగి ప్రారంభం కావాల‌ని స్వామివారిని ప్రార్థిస్తూ 30 రోజుల‌ పాటు టిటిడి ఈ కార్య‌క్ర‌మాన్ని త‌ల‌పెట్టింది. ఇందుకోసం జులై 24న సాయంత్రం ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన‌పీఠంలో అంకురార్ప‌ణ జ‌రుగ‌నుంది.

ఇందుకోసం వ‌సంత మండ‌పంలో రామాయ‌ణంలోని బాల‌కాండ, అయోధ్య‌కాండ‌, అర‌ణ్య‌కాండ‌, కిష్కింధ‌కాండ‌, సుంద‌ర‌కాండ‌, యుద్ధ‌కాండలోని ప్ర‌ధాన‌మైన స‌ర్గ‌ల‌ను పారాయ‌ణం చేస్తారు. ప్ర‌తిరోజూ ఉద‌యం 8.30 నుండి 10 గంట‌ల వ‌ర‌కు జ‌రుగ‌నున్న ఈ శ్లోక పారాయ‌ణాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌నుంది. మ‌రోవైపు ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠంలో ఉద‌యం, సాయంత్రం వేళ‌ల్లో హోమాలు, జ‌పాలు నిర్వ‌హిస్తారు. ఈ కార్య‌క్ర‌మాల్లో మొత్తం 32 మంది వేద‌పండితులు పాల్గొంటారు. ఒక్కో రోజు ఒక్కో కార్యాన్ని సిద్ధించాల‌ని కోరుతూ ఆయా కాండ‌ల్లోని ప్ర‌ధాన‌మైన ఎంపిక చేసిన స‌ర్గ‌ల‌ను పారాయ‌ణం చేస్తారు.

తొలిరోజైన జులై 25వ తేదీన ధ‌ర్మ‌కార్య‌సిద్ధి కోసం అయోధ్య‌కాండ‌లోని 21 నుండి 25 స‌ర్గ‌ల్లో గ‌ల 221 శ్లోకాలు, జ‌న్మాంత‌ర స‌క‌లసౌఖ్య‌ప్రాప్తి కోసం యుద్ధ‌కాండ‌లోని 131వ స‌ర్గ‌లో గ‌ల 120 శ్లోకాలు క‌లిపి మొత్తం 341 శ్లోకాల‌ను పారాయ‌ణం చేస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.