జ‌న‌వ‌రి 31న శ్రీకోదండరామస్వామివారి పేట ఉత్స‌వం

జ‌న‌వ‌రి 31న శ్రీకోదండరామస్వామివారి పేట ఉత్స‌వం

తిరుపతి, 2010 జనవరి 30: తిరుమల తిరుపతి దేవస్థానములవారు ఈనెల 31వ తేదిన తిరుపతి సమీపంలోని కూపుచంద్రపేటనందు  శ్రీకోదండరామస్వామి వారికి ఉత్సవం నిర్వహిస్తారు.

ప్రతి ఏడాది మాఘమాసం పౌర్ణమి రోజున తిరుపతిలో వెలసిన శ్రీకోదండరామస్వామి వారు సీతా, లక్ష్మణ సమేతంగా తిరుపతి నగరానికి 7 కి.మీ. దూరంలోని కూపుచంద్రపేటకు వెళ్ళి కొలువు తీరడం ఆనవాయితి. ఈసందర్భంగా శ్రీకోదండరామస్వామి వారికి ఘనంగా ఉత్సవం నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.