JEO INSPECTS TTD EDUCATION INSTITUTIONS _ టిటిడి విద్యాసంస్థ‌ల‌ను ప‌రిశీలించిన జెఈవో(ఆరోగ్యం మ‌రియు విద్య) శ్రీ‌మ‌తి సదా భార్గ‌వి

Tirupati, 23 Nov. 20: JEO for Health and Education Smt Sada Bhargavi inspected TTD educational institutions on Monday. 

As part of her inspection she verified Covid norms, mid-day meals scheme and teaching methods in all these institutions. 

Her inspection included Sri Kapileswara Swamy School at Tatitopu, SP Polytechnic College, SPW Degree and PG College, SV Oriental High School, SGS High School and gave some constructive suggestions to the respective principals as the classes for 8th, 9th, 10th class pupils have commenced following Covid norms.

DEO Sri Ramana Prasad was also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI 

టిటిడి విద్యాసంస్థ‌ల‌ను ప‌రిశీలించిన జెఈవో(ఆరోగ్యం మ‌రియు విద్య) శ్రీ‌మ‌తి సదా భార్గ‌వి

తిరుపతి, 2020 న‌వంబ‌రు 23: టిటిడి ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహిస్తున్న పాఠశాలలో కోవిడ్‌-19 మార్గ‌ద‌ర్శ‌కాల మేరకు సోమవారం నుండి నిర్వహిస్తున్న తరగతులను, మధ్యాహ్న భోజనం అమ‌లుతీరును జెఈవో(ఆరోగ్యం మ‌రియు విద్య) శ్రీ‌మ‌తి సదా భార్గ‌వి ప‌రిశీలించారు.

తిరుప‌తి స‌మీపంలోని తాటితోపులో గ‌ల శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామి పాఠ‌శాల‌, శ్రీ పద్మావతి హై స్కూల్,ఎస్.కె.ఆర్.ఎస్.హై స్కూల్, ఎస్.వి. హై స్కూల్, ఎస్.వి.ఒరియంటల్ హై స్కూల్, ఎస్.జి.ఎస్. హై స్కూల్ లను సంద‌ర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు సోమవారం నుండి 8, 9, 10వ తరగతి విద్యార్థులకు తరగతులు ప్రారంభించిన విషయం విదితమే.

కోవిడ్‌-19 మార్గ‌ద‌ర్శ‌కాల మేరకు ఆయా పాఠశాలలో విద్యార్థులను భౌతిక దూరం పాటిస్తూ కూర్చుని పెట్టిన విధానం, పాఠ్యాంశాల బోధన, పరిశీలించి ప్ర‌ధానోపాధ్యాయుడికి పలు సూచనలు చేశారు. ఇస్కాన్ అందిస్తున్న మ‌ధ్యాహ్న భోజ‌నం నాణ్య‌త‌ను విద్యార్థుల‌ను అడిగి తెలుసుకున్నారు. ఆ త‌రువాత జగనన్న విద్యా కానుక వారోత్సవాలపై సమీక్ష నిర్వహించారు.

జెఈఓ వెంట టిటిడి విద్యాశాఖాధికారి డా. ఆర్.రమణప్రసాద్ ఉన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.