తితిదే పరిపాలనా భవనంలో గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

తితిదే పరిపాలనా భవనంలో గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

తిరుపతి, జనవరి 25, 2013: తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో జనవరి 26వ తేదీన నిర్వహించనున్న గణతంత్ర వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరిపాలనా భవనం వెనక వైపుగల మైదానంలో తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం శనివారం ఉదయం 8.45 గంటలకు జాతీయ జెండాను ఎగురవేస్తారు. అనంతరం ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అంతేగాక చక్కగా విధులు నిర్వహించిన ఉద్యోగులకు ఈ సందర్భంగా ఉత్తమ అవార్డులను అందజేయనున్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.