తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఘనంగా దీపావళి ఆస్థానం

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఘనంగా దీపావళి ఆస్థానం

తిరుపతి, 2019, అక్టోబరు 27: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఆదివారం అమావాస్య, దీపావళి సందర్భంగా రాత్రి 7.00 నుండి 8.00 గంటల వరకు దీపావ‌ళి ఆస్థానం వైభ‌వంగా నిర్వహించారు.

దీపావళి సందర్భంగా ఆదివారం రాత్రి 7.00 గంటలకు తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయం నుండి నూతన వస్త్రాలు, దోశపడి, దీపాలు తీసుకువచ్చి శ్రీకోదండరామస్వామివారికి సమర్పించారు. ఈ సందర్భంగా అమావాస్యనాడు ఆలయంలో నిర్వహించే సహస్ర కలశాభిషేకంసేవ, హనుమంత వాహనసేవను టిటిడి రద్దు చేసింది.
     
ఈ కార్యక్రమంలో టిటిడి డెప్యూటీ ఈవో శ్రీమ‌తి శాంతి, ఏఈవో శ్రీ తిరుమలయ్య, సూపరింటెండెంట్‌ శ్రీ ర‌మేష్‌, ఆలయ అర్చకులు, ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.