నవంబరు 19న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో లక్ష కుంకుమార్చన

నవంబరు 19న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో లక్ష కుంకుమార్చన

తిరుపతి, 2022 నవంబరు 18: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా నవంబరు 19వ తేదీ శనివారం ఆలయంలో లక్ష కుంకుమార్చన వైభవంగా నిర్వహించనున్నారు.

ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహిస్తారు. అనంతరం అమ్మవారి ఉత్సవర్లను శ్రీకృష్ణస్వామి ముఖ మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు లక్ష కుంకుమార్చన నిర్వహిస్తారు.

గృహస్తులు(ఇద్దరు) రూ.1,116/- చెల్లించి టికెట్‌ కొనుగోలు చేసి లక్ష కుంకుమార్చన సేవలో పాల్గొనవచ్చు. వీరికి ఒక ఉత్తరీయం, ఒక రవికె, రెండు లడ్లు, రెండు వడలు బహుమానంగా అందజేస్తారు. ఆలయం వద్దగల కౌంటర్‌లో కరంట్‌ బుకింగ్‌లో భక్తులు ఈ టికెట్లు పొందొచ్చు. ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన టికెట్లు కేటాయిస్తారు.

న‌వంబ‌రు 19న అంకురార్ప‌ణ

న‌వంబ‌రు 19వ తేదీ సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు పుణ్యహవచనం, రక్షా బంధనం, ఆలయ నాలుగు మాడ వీధుల్లో సేనాధిపతి ఉత్సవం నిర్వహించిన తరువాత శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహిస్తారు.


బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం రాత్రి

20-11-2022 ధ్వజారోహణం చిన్నశేషవాహనం

21-11-2022 పెద్దశేషవాహనం హంసవాహనం

22-11-2022 ముత్యపుపందిరి వాహనం సింహవాహనం

23-11-2022 కల్పవృక్ష వాహనం హనుమంతవాహనం

24-11-2022 పల్లకీ ఉత్సవం గజవాహనం

25-11-2022 సర్వభూపాలవాహనం స్వర్ణరథం, గరుడవాహనం

26-11-2022 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

27- 11-2022 రథోత్సవం అశ్వ వాహనం

28-11-2022 పంచమితీర్థం ధ్వజావరోహణం.

29-11-2022 ——- సాయంత్రం – పుష్పయాగం.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.