NEW CT SCAN INAUGURATED IN BIRRD _ బర్ద్ లో అధునాతన సిటీ స్కాన్ ప్రారంభం

TIRUPATI, 18 APRIL 2022: TTD Additional EO Sri AV Dharma Reddy on Monday evening inaugurated Rs. 3.50crore worth of advanced CT Scan in BIRRD Hospital in Tirupati.

 

Delhi based Dharma Pal Satya Pal Group has donated the equipment TTD-run ortho hospital.

 

Tirupati JEO Sri Veerabrahmam, SVIMS Director Dr Vengamma, BIRRD Special Officer Dr Reddeppa Reddy, the company’s Director Sri Atul Jain and others were also present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

బర్ద్ లో అధునాతన సిటీ స్కాన్ ప్రారంభం

తిరుపతి 18 ఏప్రిల్ 20 22:  బర్ద్ ఆస్పత్రిలో అధునాతన సిటీ స్కాన్ యంత్రాన్ని టీటీడీ అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి సోమవారం సాయంత్రం ప్రారంభించారు. ఢిల్లీకి చెందిన ధర్మ పాల్ సత్య పాల్ గ్రూప్ సంస్థ రూ 3 కోట్ల 50 లక్షల రూపాయల విలువచేసే సిటి స్కాన్ యంత్రాన్ని ఆస్పత్రికి విరాళంగా అందించింది.

సందర్భంగా శ్రీ ధర్మారెడ్డి శ్రీవారి చిత్రపటానికి పూజలు నిర్వహించి సిటీ స్కాన్ యంత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. తిరుపతి జేఈవో శ్రీ వీరబ్రహ్మం, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ, బర్డ్ ప్రత్యేకాధికారి డాక్టర్ రెడ్డప్ప రెడ్డి, ధర్మ పాల్ సత్యపాల్ గ్రూప్ డైరెక్టర్ శ్రీ అతుల్ జైన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి దాత శ్రీ అతుల్ జైన్ ను శాలువాతో సన్మానించి శ్రీవారి చిత్ర పటం, ప్రసాదాలను అందించారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారి చే విడుదల చేయడమైనది