GOVINDARAJA AND CONSORTS RIDE BHOGI THERU _ భోగితేరుపై ద‌ర్శ‌మిచ్చిన శ్రీ‌భూ స‌మేత గోవింద‌రాజ‌స్వామి

Tirupati, 25 May 2021: On the eighth day of the ongoing annual Brahmotsavam of Sri Govindarajaswami, the deities took celestial ride on Bhogi Theru instead of Rathotsavam in Ekantam due to Covid guidelines.

Earlier Snapana Tirumanjanam was performed for the utsava idols of Sri Govindaraja Swamy and His consorts Sridevi and Bhudevi in the morning.

Tirumala pontiffs Sri Sri Sri Pedda Jeeyarswamy and Sri Sri Sri Chinna Jeeyarswamy, Special grade DyEO Sri Rajendrudu and other staffs were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భోగితేరుపై ద‌ర్శ‌మిచ్చిన శ్రీ‌భూ స‌మేత గోవింద‌రాజ‌స్వామి

తిరుపతి, 2021 మే 25: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మంగ‌ళ‌వారం ఉద‌యం రథోత్సవం బ‌దులు భోగితేరుపై శ్రీ దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవిదంరాజ‌స్వామివారు ద‌ర్శ‌న‌మిచ్చారు. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న సేవ నిర్వ‌హించారు.

ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనసు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం తేరును ద‌ర్శించ‌డం వ‌ల‌న‌ క‌లుగుతుంది.

అనంతరం ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు శ్రీ దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామివారికి, నమ్మాళ్వార్ల ఉత్స‌వ‌ర్ల‌కు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రినీళ్ళు, ప‌సుపు, చందనంల‌తో అభిషేకం చేశారు.

సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు స్వామివారు అశ్వ‌వాహ‌నంపై క‌టాక్షించ‌నున్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, ఆల‌య ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఏఈవో శ్రీ ర‌వికుమార్‌రెడ్డి, ఇతర అధికారులు, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.